Search
Close this search box.
Search
Close this search box.

గ్లోబ‌ల్ ఇన్వెస్ట‌ర్స్ స‌ద‌స్సు ఒప్పందాల అమ‌లుపై సీఎం జగన్ స‌మీక్ష‌

గ్లోబల్ సమ్మిట్ ఒప్పందాల ఆన్ గ్రౌండ్ లక్ష్యంగా పారిశ్రామిక కార్యాచరణ

పారిశ్రామిక రంగంలో MSMEలది కీలక పాత్ర, ఐటీ రంగాలకు హబ్ విశాఖ..

GIS ఒప్పందాల కంపెనీలు ఫిబ్రవరి 2024 నాటికి పనులు ప్రారంభించాలి

గ్లోబ‌ల్ ఇన్వెస్ట‌ర్స్ స‌ద‌స్సు ఒప్పందాల అమ‌లుపై సీఎం జగన్ స‌మీక్ష‌

గ్లోబల్ సమ్మిట్ ఒప్పందాల ఆన్ గ్రౌండ్ చేయడమే లక్ష్యంగా పారిశ్రామిక కార్యాచరణ చేపట్టాలని సీఎం జగన్ అధికార యంత్రాంగాన్ని అదేశించారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో వచ్చిన పెట్టుబడులపై సీఎం జ‌గ‌న్‌ అధ్య‌క్ష‌త‌న తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం నాడు ప్రత్యేక స‌మీక్షా స‌మావేశం జరిగింది. శాఖల వారీగా కుదుర్చుకున్న ఒప్పందాలు, ప్రస్తుత వాటి పరస్థితి పై శాఖాధికారులతో సీఎం జ‌గ‌న్‌ సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్బంగా అధికారులు 2022 జనవరి- డిసెంబర్ మధ్యకాలంలో రూ.45,217 కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. 2022-23లో రూ.1.6లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులు రాష్ట్రం నుంచి ఎగుమతి అయ్యాయని అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులకు సూచనలు చేశారు.

పారిశ్రామిక రంగంలో MSMEలది కీలక పాత్ర

పారిశ్రామిక రంగంలో ఎంఎస్‌ఎంఈల ద్వారా ఎక్కువ శాతం ఉద్యోగాలు ఉన్నాయని, ఎంఎస్‌ఎంఈలకు ప్రభుత్వం మార్గదర్శకంగా వ్యవహరించాలని సీఎం జగన్ సూచించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ ఉన్న ఉత్పత్తులు ఏంటి? వాటి ఉత్పత్తిని సాధించడానికి ఎంఎస్‌ఎంఈలకు కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానం? ఉత్పత్తి అయిన వస్తువులకు అంతర్జాతీయంగా ప్రముఖ బహుళజాతి సంస్థలతో అనుసంధానం? ఈ మూడు అంశాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి సీఎం జగన్ పేర్కొన్నారు. ఎంఎస్‌ఎంఈలకు అవసరమైన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందేలా చూడాలన్నారు. దీనిపై ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. పరిశ్రమల శాఖలో ఎంఎస్‌ఎంఈల కోసం ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని, ఈ విభాగానికి ఒక కార్యదర్శిని కూడా నియమించాలని సూచించారు. రాష్ట్రం నుంచి బహుళ ఉత్పత్తులు, బహుళ దేశాలకు ఎగుమతులు లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. మరోవైపు నైపుణ్యాలను పెంచడంపైనా ప్రత్యేక దృష్టిపెట్టాలని, ప్రస్తుతం ఉన్నడిగ్రీలకు తోడు అదనంగా ప్రత్యేక నైపుణ్యాలను అందించాల్సిన అవసరం ఉందన్నారు.

నాలుగేళ్లలో సాధించిన పారిశ్రామిక వృద్దిపై చర్చ

వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో సాధించిన వృద్ధిని అధికారులు వివరించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 సార్లు ఎస్‌ఐపీబీ సమావేశాలు నిర్వహించి 59 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపామని అధికారులు తెలిపారు. వీటి ద్వారా రూ.3,39,959 కోట్ల పెట్టుబడులు, 2,34,378 మందికి ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడించారు. 2016 నుంచి 2018 వరకూ గత ప్రభుత్వం భాగస్వామ్య సదస్సుల ద్వారా 1,739 ఎంఓయూలను కుదుర్చుకుంటే రూ. 18,87,058 కోట్ల పెట్టుబడులు వస్తాయని చెప్పారని, కాని ఇందులో 10శాతం కూడా వాస్తవరూపం దాల్చలేదని పేర్కొన్నారు. విశాఖపట్నంలో నిర్వహించిన గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌ ద్వారా 387 ఒప్పందాలు కుదుర్చుకున్నామని అన్నారు. ఇందులో పరిశ్రమలు వాణిజ్య శాఖ తరఫున 100 ఒప్పందాలు కుదిరాయని, ఇందులో 13 ఒప్పందాలు ఇప్పటికే వాస్తవ రూపం దాల్చాయని, రూ.2,739 కోట్ల పెట్టుబడులు వచ్చాయని తద్వారా 6,858 మందికి ఉద్యోగాలు లభించాయని అధికారులు వివరించారు. రానున్న రోజుల్లో మరిన్ని కంపెనీలు పనులు మొదలుపెట్టనున్నాయని తెలిపారు. జనవరి 2024లోపు 38 కంపెనీలకు పనులు ప్రారంభం అవుతాయని, మార్చి 2024లోపు మరో 30 కంపెనీలు పనులు పూర్తిచేసుకుని ఉత్పత్తిని ప్రారంభిస్తాయని వెల్లడించారు. గ్లోబల్‌ ఇన్వెస్టర్స్ ద్వారా ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెలన్నీ కూడా ఫిబ్రవరి 2024 నాటికి పనులు ప్రారంభించేలా చూడాలని సీఎం జగన్ ఆదేశించారు

విద్యుత్‌ ప్రాజెక్టులపైనా సమీక్ష

విశాఖ సదస్సు ద్వారా 25 విద్యుత్‌ ప్రాజెక్టులకోసం ఒప్పందాలు కుదుర్చుకున్నామని అధికారులు వెల్లడించారు. ఇందులో 8 ప్రాజెక్టులు ఎస్‌ఐపీబీ ఆమోదం పంపించామని, మరో 4 ప్రాజెక్టుల్లో పనులు ప్రారంభం కానున్నాయని తెలిపారు. మరో 8 ప్రాజెక్టుల డీపీఆర్‌లు సిద్ధం అయ్యాయని పేర్కొన్నారు. విశాఖ సదస్సు ద్వారా కాకుండా అంతకు ముందే రాష్ట్ర ప్రభుత్వంతో 20 విద్యుత్‌ ప్రాజెక్టులకోసం ఒప్పందాలు కుదుర్చుకోగా అందులో 6 ప్రాజెక్టుల్లో పనులు త్వరలోనే ప్రారంభం అవుతాయని, 11 డీపీఆర్‌ పూర్తిచేసుకున్నాయని అన్నారు. మొత్తం వీటిద్వారా 8.85లక్షల కోట్లు పెట్టిబడులు వస్తుండగా, 1,29,650 మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు.

ఐటీ హబ్ గా విశాఖ: సీఎం జగన్

ఐటీ, ఐటీ ఆధారిత సేవలు రంగాలకు విశాఖ హబ్‌ కావాలని సీఎం అన్నారు. దీనికోసం ప్రత్యేక శద్ధ తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. దీనివల్ల విశాఖనగరం ఖ్యాతి పెరుగుతుందని, ఐటీకి చిరునామాగా మారుతుందని సీఎం అన్నారు. ప్రముఖ సంస్థలతో సంప్రదింపులు నిరంతరం కొనసాగించాలని అధికారులను ఆదేశించారు.

ఐటీ ఎంఓయూల్లో గణనీయ ప్రగతి:

ఎలక్ట్రానిక్స్‌ రంగంలో 88 ఒప్పందాలు చేసుకున్నామని, వీటి విలువ రూ.44,963 కోట్లు ఉందని అధికారులు తెలిపారు. ఇందులో 85శాతం కంపెనీలు నిర్మాణ పనులు ప్రారంభించే దశలోనో, లేదా ఉత్పత్తికి సిద్ధమైయ్యే దశలో ఉన్నాయని వెల్లడించారు. దాదాపుగా రూ.38,573 కోట్ల పెట్టుబడులు వాస్తవరూపం దాల్చాయని అని తెలిపారు. 

ఇవేకాకుండా ఫుడ్‌ ప్రాససింగ్‌, పశుసంవర్థక శాఖ, టూరిజం రంగాల్లో ఒప్పందాలపైనా కూడా సీఎం సమీక్ష నిర్వహించారు. ఫుడ్‌ ప్రాససింగ్‌ రంగంలో పెట్టుబడి ప్రతిపాదనలను వీలైనంత త్వరగా కార్యరూపంలో తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. టమెటా, ఉల్లి లాంటి డిమాండులో తీవ్ర వ్యత్యాసం తరచుగా వచ్చే పంటల విషయంలో ఈ ప్రాససింగ్‌ యూనిట్లనే నెలకొల్పే పనులను వేగవంతం చేయాలన్నారు. దీనివల్ల రైతులకు తోడ్పాటు ఇచ్చినట్టువుతుందని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి